రీ రిలీజ్ కి రెడీ అయిన మహేష్ క్లాసిక్ మూవీ..?
సూపర్ స్టార్ మహేష్ బాబు చాల ఏళ్ల క్రితం అతడు అనే మూవీ లో హీ రో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . జయభేరి ఫిలిమ్స్ బ్యానర్పై మురళి మోహన్ నిర్మించిన ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా ... కోట శ్రీనివాస్ రావు ఈ మూవీ లో విల్లన్ పాత్రలో నటించాడు. బ్రహ్మానందం , నాజర్ , సునీల్ , అజయ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మాములు విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా ఆ తర్వాత బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను సూపర్ గా అక్కటుకుంది. ఈ సినిమా మహేష్ కెరీర్లోనే క్లాసిక్ మూవీ గా మిగిలి పోయింది. ఆలా మజేష్ కెరీర్లో క్లాసిక్ మూవీ గా మిగిలిన ఈ మూవీ ని రి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ని ఈ ఫిబ్రవరి 28 వ తేదీన రి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మహేష్ నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికే రి రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ను రాబట్టాయి. మరి అతడు చిత్రం రి రిలీజ్ లో భాగంగా బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను దక్కిచుకుంటుందో చూడాలి. ఇక పోతే ప్రస్తుతం మహేష్ బాబు , రాజామౌళి దర్శకత్వం లో రూపొందుతున్న వారణాసి అనే సినిమా లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో బారి అంచనాలు ఉన్నాయి.