ఏపీ: వారందరికీ గుడ్ న్యూస్.. కుటుంబానికి రూ.20 వేలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు (61) రోజులపాటు సముద్రంలో వేట నిషేధించడం తెలిసిందే.. ఈ సమయంలో వీరికి ఆదాయం ఉండదు కనుక, ఈ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం కూటమి ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ .20వేల రూపాయలు చొప్పున అందిస్తోంది. గత వైసిపి ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు ఇవ్వగా ఇప్పుడు రెండేళ్లలోనే మత్స్యకారుల కుటుంబాలు కూడా పెరిగాయి. దీంతో రూ.500 కోట్ల రూపాయలకు పైగా విడుదల చేయబోతున్నారు.
మత్స్యకారుల సేవ పథకం ద్వారా ఈ డబ్బులను మత్స్యకారుల ఖాతాలో జమ చేయనున్నారు. మొత్తం 1,30,796 మత్స్యకారుల కుటుంబాలకు రూ.20 వేల రూపాయల చొప్పున జమ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాలని నిబంధన విధించింది. దీంతో ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు జమ చేస్తోంది. ఇప్పటివరకు కేవలం 90 శాతం మంది మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తి కాకపోతే వారి ఖాతా లో డబ్బులు జమా కావని ప్రభుత్వం చెబుతోంది.