కిట్టు ఉన్నాడు జాగ్రత్త : రివ్యూ
కిట్టు (రాజ్ తరుణ్) ఓ గ్యారేజ్ నడుపుతుంటాడు.. మొదటి చూపులోనే జానకి (అను ఇమ్మాన్యుయెల్)ను చూసి లవ్ లో పడిన కిట్టు డబ్బు కోసం సడేన్ గా కుక్కల దొంగగా మారతాడు. ఇదే విషయం తెలుసుకున్న జానకి కిట్టుని అపార్ధం చేసుకుంటుంది. ఇంతలోనే సిటిలో ఉన్న ఓ పెద్ద రౌడి అర్బజ్ ఖాన్ జానకిని కిడ్నాప్ చేస్తాడు. జానకిని ఆ కిడ్నాపర్ దగ్గర నుండి విడిపించే ప్రయత్నంలో కిట్టు ఏం చేశాడు అన్నది అసలు కథ.
కిట్టుగా రాజ్ తరుణ్ నటన సూపర్ అనిపించేశాడు. పాత్రకు కావాల్సిన ఫన్ క్రియేట్ చేస్తూ సినిమా నడిపించారు. ఇక హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ కూడా జానకిగా బాగా నటించింది. సినిమాలో ఇద్దరి పెయిర్ బాగుంది. ఇక విలన్ గా చేసిన అర్బజ్ ఖాన్ తనవరకు బాగానే చేశాడు. అయితే దర్శకుడు వంశీ కృష్ణ ఆ క్యారక్టర్ ముగింపు సరిగా ఇవ్వలేదు. థర్టీ ఇయర్స్ పృధ్వి సినిమా చివర్లో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వేలా చేశాడు. హీరో ఫ్రెండ్స్ గా ప్రవీణ్, సుదర్శన్ లు చేసిన కామెడీ కూడా బాగానే ఉంది.
వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆధ్యంత కామెడీ ఎంటర్టైనర్ గా సాగించాడు. శ్రీకాంత్ విస్సా కథను దర్శకుడు తెరకెక్కించిన విధానం ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా కథనంలో దర్శకుడి ప్రతిభ కనబడింది. మొదటి భాగం కాస్త అటు ఇటుగా ఉన్నా సెకండ్ హాఫ్ సినిమాను పైకి లేపారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అనీల్ సుంకర నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత పెట్టాలో అంత పెట్టేసి రిచ్ గా వచ్చేలా చేశారు.