టాలీవుడ్ లోకి నాగశౌర్య సరసన ‘ఛలో’సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘గీతాగోవందం’సినిమాలో నటించింది. ఛలో సినిమాతో మంచి హిట్ అందుకున్న రష్మిక మందన ‘గీతాగోవందం’సినిమాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రష్మికకు వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. కన్నడ హీరోయిన్ గా తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు తీస్తున్న రష్మిక ఆ మద్య నాగార్జున, నాని నటించిన దేవదాసు సినిమాలో నటించింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి ‘డియర్ కామ్రెడ్’సినిమాలో నటిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ ను వదిలారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటిస్తే..రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తుంది. ఈ టీజర్ పై కొన్ని విమర్శలు మొదలయ్యాయి. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మద్య లిప్ లాక్ సీన్ రావడంతో ఆమెపై విమర్శలు మొదలయ్యాయి. గతంలో కన్నడ మూవీలో కూడా ఇలాంటి సీన్లలో నటించి విమర్శల పాలైంది.
తాజాగా ఈ విమర్శలపై రష్మిక స్పందిస్తూ..ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య సందర్భానికి తగినట్టుగా ఈ సన్నివేశం వస్తుందని..అంతే కాదు సినిమా ఛాన్సులు లేక తప్పని పరిస్థితుల్లో ఇలాంటి సిన్లలో నటించాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అంటుంది. అయితే సినిమాలో కొన్ని సందర్భాల్లో ప్రేమకుల మద్య ఇలాంటి సీన్లు వస్తుంటాయి..ఆ సీన్ కావాలని క్రియేట్ చేసింది కాదు. నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయవలసిన బాధ్యత నాపై వుంది అని ఆమె చెప్పుకొచ్చింది.