మహేష్ సినిమాకోసం పడరానిపాట్లు పడుతున్న విజయశాంతి !

Seetha Sailaja
లేడీ అమితాబ్ గా విజయశాంతి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా సుమారు 15 ఏళ్ళు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది.  ఆతరువాత రాజకీయాల బాట పట్టిన విజయ్ శాంతి 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి ముఖానికి మేకప్ వేసుకుని తిరిగి కెమెరా ముందుకు రాబోతోంది.   మహేష్ నటిస్తున్న 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఒక కీలక పాత్ర రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈమె తన పాత్రకు తగ్గట్టుగా ద్వారా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నారు. 

ప్రస్తుతం తనపాత్రకు తగ్గట్టే మేకోవర్ ఉండాలని భావించి ఆ పాత్రకు సంబంధించిన లుక్ కోసం కఠోరంగా శ్రమిస్తున్నారట. కమ్ బ్యాక్ అదిరిపోవాలంటే ఇప్పుడున్న గ్లామరస్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఏమాత్రం తీసిపోకుండా రెడీ అవ్వాలని విజయ్ శాంతి డిసైడ్ అయినట్లు సమాచారం చాల గ్యాప్ తరువాత ప్రేక్షకులముందుకు రాబోతున్న విజయశాంతి తన ప్రత్యేకత చూపించుకోవాలి అంటే ముందుగా తన రూపం మార్చుకోవాలని  ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  

మరోవైపు మహేష్ లాంటి స్మార్ట్ హీరోకి అత్తగా కనిపించాలంటే అంతే స్లిమ్ గా కనిపించాలన్న లాజిక్ తో విజయ్ శాంతి తన లుక్ ను మెరుగు పరుచుకోవడం కోసం రెగ్యులర్ గా ఫిట్ నెస్ జిమ్ కి వెళ్ళడమే కాకుండా తన ఫేస్ లో గ్లౌ పెంచుకోవడం కోసం యోగా చేస్తూ తన డైటింగ్ లో చాలా మార్పులుచేసుకున్నట్లు టాక్. దీనితో 40 ప్లస్ లోఉన్న విజయశాంతి  గంటల తరబడి శారీరకంగా ఫిట్ నెస్ కోసం శ్రమించడమే కాకుండా తన  ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలుతీసుకుంటున్నట్లు సమాచారం. 


1990లో అందరు అగ్ర కథానాయకుల సరసన విజయశాంతి ఆపై లేడీ ఓరియెంటెడ్ పాత్రల్ని ఎంపిక చేసుకుని ఫిలిం ఇండస్ట్రీ వర్గాల్లోనూ లేడీ బాస్ అని ప్రూవ్ చేసుకున్న విషయం తెలిసిందే. విజయశాంతి నటించిన చివరి చిత్రం ‘నాయుడమ్మ’ 2006లో రిలీజైంది. మళ్లీ ఇంత కాలానికి ముఖానికి రంగేసుకోవడం ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర న్యూస్ గా మారింది. మహేష్ తో నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ఊహించిన విధంగా హాట్ హిట్ అయితే విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ కు ఇక ఎదురు ఉండదు అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: