'బలుపు' లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. శృతి హాసన్ హీరోయిన్. కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమెకు ఇది కంబ్యాక్ మూవీగా అంతా చర్చించుకుంటున్నారు.
ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాకు శృతి హాసన్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది. తనకు రూ. 1.5 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని భీష్మించుకుని కూర్చుందట. ఈ విషయంలో ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ అంశంపై ఓ క్లారిటీ రానుంది.
ఒక వేళ శృతి హాసన్ పేమెంట్ విషయంలో తగ్గకపోతే మరో హీరోయిన్ కోసం ప్రయత్నించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఈ చెన్నై బ్యూటీ తెలుగులో చివరగా 2017లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'కాటమరాయుడు' మూవీలో నటించింది.
ఆ మూవీ ప్లాప్ కావడంతో ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్లో ఈ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజ ఈ కథపై పూర్తి నమ్మకంగా ఉన్నారట. తమది హిట్ కాంబినేషన్ కావడం కూడా కలిసొచ్చే అంశం.
ప్రస్తుతం మాస్ మహరాజ్ 'డిస్కోరాజా' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రవితేజతో 'నేల టిక్కెట్' మూవీ చేసిన రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ, పాయల్ రాజ్పుత్, నభా నటేష్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు.