ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రోబోతున్న సినిమా `ఇస్మార్ట్ శంకర్`. ఈ సినిమాపై అందరూ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు ఏడు వరుస ఫ్లాపులతో వస్తున్న పూరీ జగన్నధ్ దర్శకత్వం వహించారు. రామ్-పూరీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని టూరింగ్ టాకీస్, పూరి కనక్ట్ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, నభా నటేష్ రామ్ సరసన్ నటిస్తున్నారు.
అయితే ఆమె చేసిన మూడు సినిమాలు హిట్ ఇవ్వకపోవడంతో ఆమె కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు కూడా ఈ సినిమా హిట్ అవసరం. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సైతం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమా ఫై అంచనాలు పెంచేసింది.
ఇక తాజాగా ఈ సినిమాపై రామ్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.
ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూశా.. దీనమ్మా కిక్కూ!! ఈ పాత్రను పోషిస్తున్నప్పుడు.. స్క్రీన్పై చూసుకున్నప్పడు వచ్చిన కిక్కే వేరప్పా.. అని చెప్పిన రామ్ మాటలకు ఈ సినిమాపై మరింత అంచానాలు పెరిగాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్లతో బిజీ గా ఉంటూ జనాల్లో సినిమాను చూడాలనే ఆత్రుత పెంచుతున్నారు. మరి ఈ సినిమా ఫ్లాపుల్లో ఉన్న వీరద్దరికీ హిట్ ఇస్తుందో? లేదో? ఈ నెల 18న చూడాల్సి ఉంది.