మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమాకి ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమా అయిన సాహో లాంటి కష్టాలే వెంటాడుతోన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిరంజీవి తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేయగా... మిగిలిన పాత్రలు కూడా డబ్బింగ్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. సైరాకు బాలీవుడ్ కంపోజర్ అమిత్ త్రివేది మ్యూజిక్ అందించారు. సినిమా వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అందించడం లేదట. సైరా బీజీఎం కోసం జూలియస్ పకియంను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్ కు భారత్కు మ్యూజిక్ అందించారు.
సుల్తాన్ - టైగర్ జిందా హై - భాగీ 2 - కిక్ - ధూమ్ 3 లాంటి ఎన్నో సినిమాలకు ఇతని బీజీఎమ్ చాలా ప్లస్ అయ్యింది. సల్మాన్ ఖాన్ విపరీతంగా ఇష్టపడే ఈ జూలియస్ పకియంను ఆయన రికమెండేషన్ మీదే చరణ్ తీసుకున్నట్టు వినిపిస్తోంది. మరి సల్మాన్ రికమెండేషన్ చరణ్, చిరు ఓకే చేశారా ? లేదా ? అన్నది మాత్రం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.