మెగా ఫ్యామిలీ అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి... పవర్స్టార్ పవన్కళ్యాణ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ కోసం తెలుగు సినిమా అభిమానులు రెండు దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ చేసేందుకు టాలీవుడ్లో ఏ దర్శక నిర్మాత ఇప్పటివరకు సాహసం చేయలేదు. అయితే కళాబంధు సుబ్బరామిరెడ్డి మాత్రం గతంలో చిరు - పవన్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు.
వాస్తవంగా సుబ్బరామిరెడ్డి సినిమాలు మానేసి చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు ఆయన వ్యాపార... రాజకీయ రంగాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన గతంలో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ - చిరంజీవితో అదిరిపోయే మల్టీస్టారర్ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారట. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఈ సినిమా ఉంటుందని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలు చేసుకుంటుంటే... పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు.
ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఐదేళ్ల వరకు పవన్ మరి అంత బిజీగా ఉండరు. ఈ క్రమంలోనే సుబ్బరామిరెడ్డి పవన్తో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ సుబ్బరామిరెడ్డికి చెందిన పార్క్ హయత్ హోటళ్లోనే ఎక్కువుగా ఉంటున్నారట. ఈ క్రమంలోనే సుబ్బరామిరెడ్డి మల్టీస్టారర్ సినిమా అంశం ప్రస్తావించారని టాక్. పవన్ ఇప్పుడు పొలిటికల్ గా బిజీగా లేకపోయినా... సినిమాల గురించి ఆలోచించేంత సమయమైతే లేదు.
తాను ఇకపై సినిమాలు చేయనని చెప్పాడు. మరి ఇప్పుడు అన్నతో సినిమా కోసం అయినా మనస్సు మార్చుకుంటాడేమో ? చూడాలి. ఫైనల్గా అన్నదమ్ములతో సినిమాకు సుబ్బరామిరెడ్డి రెడీగా ఉన్నారు. ఇక వీళ్లు ఒప్పుకుంటే త్రివిక్రమ్కు కథ రెడీ చేయడం పెద్ద కష్టం కాదు.