చావుని ముద్దాడి వచ్చిన పోసాని కృష్ణ మురళి..!
అదే విధంగా జగన్ పార్టీకి అద్భుతంగా మద్దతు తెలిపి తనవంతు న్యాయం చేశారు. ఎన్నికలు అయిపోయాయి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనుకోకుండా పోసాని కృష్ణమురళి ఒకానొక రోజు రాత్రి రెండు గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడంతో యశోద హాస్పిటల్ లో పోసాని కృష్ణ మురళి జాయిన్ అయ్యారట..అయినా కానీ ఎంత మంది డాక్టర్లు చూసినా జ్వరం తగ్గక పోవడం మరియు కాలకృత్యాలకు కూడా ఇతర మనుషులు ఉంటేనే వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో అదే సమయంలో అమెరికా నుండి సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ ఎం వి రావు గారు స్వదేశానికి రావడంతో పోసాని పరిస్థితి చూసి వెంటనే శరీరం మొత్తం స్కానింగ్ చేయించారట.
అప్పుడు బయటపడిందట వీపుకి నడుముకి మధ్య భాగంలో పెరుగుతున్న ఒక ఇన్ఫెక్షన్ కణితి. వెంటనే ఆపరేషన్ చేసి తీసేసారు. దాన్ని తొలగించిన మరు క్షణం నుండే పోసాని ఆరోగ్యం మెరుగు పడటం ప్రారంభమైంది. “డాక్టర్ ఎం వి రావు గారు దేవుడి లాగా సకాలంలో వచ్చి ఆ ఇన్ఫెక్షన్ ను గుర్తించి ఉండకపోతే ఇంకొక వారం రోజుల్లో ఈ పోసాని ఉండేవాడు కాదన్నా.. అంటూ చేతులు జోడించి డాక్టర్ ఎమ్ వి రావు గారికి కృతజ్ఞతలు చెప్పాడు పోసాని. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి ఆరోగ్యం మెల్లమెల్లగా మెరుగవుత్తున్నట్లు సమాచారం.