ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ..!
ఇప్పటికే పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, శేఖర్ కమ్ముల, సురేందర్ రెడ్డి, తనికెళ్ళభరణి ఇలాంటి వాళ్లు ఇప్పటికే చాలామంది తమ అభిప్రాయాలు ఈ విషయంపై తెలియజేసి సేవ్ నల్లమల స్లోగన్ కి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఇదే క్రమంలో ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క యాంకరింగ్ చేస్తున్న అనసూయ కూడా స్పందించింది. అనసూయ ట్విట్టర్ వేదికగా యురేనియం వద్దంటూ రెండు రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులను టాగ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ తరుపున బాలినేని శ్రీనివాస్ రెడ్డిని, తెలంగాణ తరుపున మాజీ అటవీ శాఖ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్నకు ట్యాగ్ చేసింది.
నిజానికి ప్రస్తుతం తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అది మర్చిపోయి అనసూయ జోగు రామన్నని టాగ్ చేయటంతో అందరు అనసూయ ట్విట్ కి కామెంట్స్ రూపంలో కౌంటర్ ఇస్తున్నారు.“జోగురామన్న అటవీ మంత్రి అని ట్యాగ్ చేసినందుకు క్షమించండి. కరెంటు అఫైర్స్ గురించి నాకు పెద్దగా తెలీదు.. పట్టులేదు కూడా. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుపై ఆలోచించండి” అని రెండోసారి ఇంద్రకరణ్రెడ్డికి ట్యాగ్ చేస్తూ అనూసూయ ట్వీట్ చేశారు. దీంతో తెలంగాణ అటవీ శాఖ మంత్రిని తప్పుగా ట్యాగ్ చేసి అడ్డంగా యాంకర్ అనసూయ బుక్ అయిపోయింది. మరొకసారి నెటిజన్ల తో విమర్శల పాలయింది.