భరత్ అనే నేను... మహర్షి వరస సినిమాలు హిట్ కావడంతో నెక్స్ట్ సినిమాను ఎంటర్టైన్మెంట్ వేలో చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మహేష్ తో నెక్స్ట్ సినిమా చేయడానికి చాలామంది రెడీ గా ఉన్నారు. కథలు వింటున్నారు. బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చేకథలను కూడా మహేష్ బాబు వింటున్నారు.
కానీ, ఏ కథను నచ్చడం లేదు. తనకు తగిన స్క్రిప్ట్ కాదని మహేష్ బాబు పక్కన పెడుతున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు సినిమాల విషయంలో చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఇదిలా ఉంటె కొన్ని రోజులక్రితమే మహేష్ బాబుకు సందీప్ రెడ్డి వంగ ఓ కథను చెప్పారట. క్రైమ్ డ్రామా స్టోరీ. అర్జున్ రెడ్డికి మించేలా రొమాంటిక్ గా సినిమా ఉంటుందని టాక్. ఇలాంటి కథలతో మహేష్ బాబు ఇప్పటి వరకు సినిమా చేయలేదు.
అయితే, మహేష్ బాబు కథను పక్కన పెట్టలేదు... అలాగని ఒకే చెప్పలేదు. దీంతో సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ సినిమాను బాలీవుడ్ లో చేయబోతున్నట్టు ప్రకటించారు. అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడు బాలీవుడ్ లోనే మరో సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. రణబీర్ కపూర్ హీరోగా సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు డెవిల్ అనే టైటిల్ ను అనుకున్నారని తెలుస్తోంది.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లను మించేలా డెవిల్ ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఒకవేళ సందీప్ రెడ్డి వంగ ఈ ప్రాజెక్ట్ పై కూర్చుంటే కనీసం మరో ఆరునెలల సమయం పడుతుంది. ఈలోగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా పూర్తవుతుంది. ఈ సినిమా తరువాత మరో కథతో సందీప్ తో వర్క్ చేస్తారో లేదంటే సందీప్ తో కుదరదులే అని చెప్పి మరో దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధం అవుతారో చూడాలి