వర్మ శిష్యుడు పూరి జగన్నాధ్ చాలా కాలం తరువాత మరలా హిట్ కొట్టాడు. ఇస్మార్ట్ శంకర్ రూపంలో టెంపర్ తరువాత హిట్ వచ్చింది. ఏంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయం దరి చేరడంతో పూరి మైమరచిపోతున్నాడు. నెక్స్ట్ సినిమా కోసం ఇప్పటికే ప్లాన్ చేశాడు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరి సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇటీవలే జరిగింది.
అయితే, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం పూరి కథపై కూర్చున్నాడని సమాచారం. ఇప్పటికే తన దగ్గర ఉన్న కథల్లోనుంచి ఓ కథను బయటకు తీసి దానికి నేటి సమయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారని, కథ విజయ్ కు ఇప్పటికే చెప్పారని తెలుస్తోంది. ఒకవిధంగా చెప్పాలి అంటే.. మహేష్ బాబుతో చేద్దామని అనుకున్న జనగణమన సినిమాను విజయ్ దేవరకొండతో చేయబోతున్నారని సమాచారం.
అప్పట్లో పూరి బిజినెస్ మెన్ తరువాత చేయాలి అనుకున్నా.. మహేష్ తో కొన్ని సినిమాలు గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో పూరి చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. దాంతో మహేష్ బాబు.. పూరీల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తరువాత కూడా మహేష్ తో సినిమా చేయాలి అనుకున్నా కుదరడం లేదు. మహేష్ యూత్ ను ప్రోత్సహిస్తూ వాళ్ళతోనే సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. ఇస్మార్ట్ హిట్ అయినప్పటికీ పూరిపై ఇప్పటికి నమ్మకం లేదు.
ఇదిలా ఉంటె, తాజగా పూరి జగన్నాధ్ శివంపేట మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో ఉన్న సహకార ఆంజనేయస్వామి వారి ఆలయంలో పూజలు పూరి జగన్నాధ్ పూజలు జరిపించారు. ఈ పూజలు ఎందుకు జరిపించారు అనే దానికి సమాధానం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కావడంతో పూజలు జరిపించారని తెలుస్తోంది. అక్కడ హోమం కూడా చేయించారు. నెక్స్ట్ సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటూ ఇలా పూజలు చేయించి ఉంటారని అనుకోవచ్చు. కంటెంట్ బాగుంటే సినిమా అదే హిట్ అవుతుంది.