బాహుబలి సీక్వెల్ పై షాకింగ్ సర్వే
ప్రవైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ జరిపిన ఈ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. బాహుబలి మూవీలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే క్యూరిసిటినీ అందరిలోనూ ఉంచాడు రాజమౌళి. అయితే ఇది బాహుబలి2 ఫిల్మ్ పై భారీ క్రేజ్ ని తీసుకువస్తుందని రాజమౌళి భావించాడు. కానీ ఇక్కడ జరుగుతుందేమింటంటే…అందరూ దీన్ని ఓ ఫన్ ఎలిమెంట్ కిందే భావిస్తున్నారు.
అంతేకానీ, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు ఉద్ధేశం కానీ, బాహుబలి2ని చూసే ఉద్దేశం కానీ లేదని చెప్పుకువచ్చారు. దీంతో బాహుబలి2 పై ప్రేక్షకుల్లో కొంత క్రేజ్ తగ్గించదని అంటున్నారు. బాహుబలి మూవీని ఏ విధంగా రిలీజ్ చేశారో..అదే హైప్ తో బాహుబలి2ని రిలీజ్ చేస్తే అంతగా ఉపయోగం లేదని అంటున్నారు.
బాహుబలి2కి ప్రత్యేకమైన పబ్లిసిటి అవసరం అంటూ ఆ సర్వే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రేక్షకులు బాహుబలి2లోని ప్రత్యేకతలను తెలుసుకోవాలని ఉందట. సీక్వెల్ లో ప్రత్యేకతలు ఏమి లేకపోతే…వారు థియోటర్స్ వచ్చి చూడాలనుకునే పాయింట్ ఏమి లేదని ముందుగానే డిసైడ్ అవుతున్నారు.