గుంటూర్ టాకీస్ సీక్వెల్ లో రేష్మీ మరోసారీ..!
ఆర్.కె బ్యానర్ పై ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో అడల్ట్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గానూ మంచి విజయం సాధించింది. ఈ తరుణంలో ఆర్ కె బ్యానర్ అధినేత రాజ్ కుమార్ గుంటూరు టాకీస్ కు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గుంటూరు టాకీస్ సినిమా కంటే ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత తెలిపారు.
ఈ సీక్వెల్ లో గుంటూరు టాకీస్ సినిమాలోని నటులతో పాటు, సీనియర్ కమెడియన్స్, నటులు కూడా నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.