జాగ్వార్ ఆడియో ఈవెంట్ కి కోటి రూపాయలా..!

Edari Rama Krishna
ఈ మద్య సినిమా రిలీజ్ కంటే ఆడియో ఫంక్షన్లకే ఎక్కువ క్రేజ్ వస్తుంది..ఒక రకంగా చెప్పాలంటే ఆడియో వేడుక హిట్ అంటే సినిమా హిట్ అనే స్థాయికి వస్తుంది.  పెద్ద హీరోల ఆడియో వేడుకలు కాస్త డిఫరెంట్ గా చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఈ వేడుకల్లో సహ హీరోలు, హీరోయిన్ల సందడి కూడా బాగానే ఉంటుంది. దీంతో అభిమానులు ఆడియో వేడుకకు ఎక్కువ రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు..ఒక్క ఆడియో ఈవెంట్ కి వస్తే తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు తో ఫోటోలు సెల్ఫీలు దిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాదు పెద్ద హీరోలు వారి చిత్రాలకు తగ్గ స్థాయిలో ఆడియో వేడుకలు జరుపుతున్నారు..మ్యూజిక్, లేజర్ లైటింగ్స్ తో హంగామా చేస్తూ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నారు.  

ఇక నిన్న జరిగిన ‘జాగ్వార్’ ఆడియో వేడుక అంగరంగ వైభవంగా జరిగింది . హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన హోటల్ నోవా టెల్ లో భారీ ఎత్తున ఈ ఆడియో వేడుక జరిగింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమార్ గౌడ మొదటి సారిగా హీరోగా ఇంట్రడ్యూసింగ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఖర్చు దాదాపు కోటి రూపాయలు అయినట్లు విశ్వసనీయ సమాచారం.

నిఖిల్ కుమార్ గౌడ  కుమారస్వామి కుమారుడు , దేవెగౌడ మనవడు కావడంతో జాగ్వార్ చిత్రాన్ని 75 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు . ఇక మనవడి కోసం మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ స్వయంగా హాజరై ఆశీస్సులు అందజేశాడు . ఈ వేడుకకు  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ,జగపతి బాబు ,సుబ్బరామిరెడ్డి లతో పాటు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారిణి పివి సింధు పాల్గొన్నారు .



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: