శ్వేతాబసు అందుకే సీరియస్ అయ్యిందా..!

Edari Rama Krishna
బాలీవుడ్ ఇండస్ట్రీలో బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన శ్వేతాబసు చిచ్చర పిడుగులా నటించి అవార్డు కూడా సొంతం చేసుకుంది. తర్వాత హీరోయిన్ గా తెలుగులో వరుణ్ సందేశ్ సరసన ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తర్వాత కాస్కో,రైడ్,కలావర్ కింగ్ ఇలా కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. అంతే కాదు ఈ అమ్మడు తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే కారణాలు ఏవైనా ఈ అమ్మడు 2014 లో ఓ వ్యభిచారం కేసులో పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యింది. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద సంచలనమే రేపింది. తర్వాత ఈ నుంచి బయటపడిన తర్వాత శ్వేత కొన్నాళ్ళు మీడియా ముందుకు రాలేదు.

అంతే కాదు అప్పట్లో శ్వేతను ఓదార్చడానికి కొంతమంది సినిమా ఇండస్ట్రీలో వారు ఆమెకు మంచి చాన్సులు కూడా ఇస్తామని చెప్పారు..కానీ తర్వాత ఒక్కరూ ముందుకు రాలేదు.  అప్పట్లో మంచు లక్ష్మి చేసిన ఓ ప్రోగ్రామ్ లో శ్వేతను ఓ అమ్మాయి సెక్స్ రాకెట్ గురించి క్వచ్చన్ చేయగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.  ఆ తర్వాత  ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా.. సెక్స్ రాకెట్ ఘటనకు సంబంధించి ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.  ఆ సమయంలో తనను ఇలాంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకండీ దయచేసి ఆ ఘటన గురించి ఏమీ అడగొద్దని అనడంతో ఎవ్వరూ ఆమెను మళ్ళీ ఆ కేసుపై ప్రశ్నించలేదు.  

ప్రస్తుతం ఈ అమ్మడికి చాలా కాలం తర్వాత మరోసారి సెక్స్ రాకెట్ ఇష్యూ ఎదురైంది. కాకపోతే ఇప్పుడు మాత్రం చాలా ఘాటుగా సీరియస్ గా స్పందించింది. ప్రస్తుతం చంద్ర నందిని అనే హిందీ టీవీ సిరీస్‌లో నందిని అనే యువరాణి పాత్రలో కనిపించనున్న శ్వేత.. ఆ సీరియల్ ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటోంది. ఇక మీడియా మరోసారి సెక్స్ రాకెట్ ఇష్యూని లేవనత్తడంతో ఆ ఘటన గురించి చెప్పేందుకు నిరాకరించింది.  

ప్రస్తుతం తను కెరీర్ పై దృష్టి పెడుతున్నట్లు తనపై ఎలాంటి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని కాస్త సీరియస్ గానే స్పందించింది. కాగా.. ఏక్తాకపూర్ రూపొందిస్తున్న ‘చంద్రనందిని’ సీరియల్‌లో జోధా అక్బర్ ఫేమ్ రజత్ తోకాస్ కీలకమైన పాత్ర పోషిస్తుండగా.. శ్వేతా బసు కీ రోల్ ప్లే చేస్తుంది. మౌర్య సామ్రాజ్యాన్ని స్దాపించిన రాజా చంద్రగుప్తుని కథతో ఈ సీరియల్ సాగుతున్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: