ఈసారి డబ్బులూ పోగేసుకోవాలి...
మరో మిథునంలాంటి సినిమా కోసం ఆయన కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే కథ సిద్ధమైంది. ఇది 1940 -50ల మధ్య నడిచే కథ అట. ఆ కాలంలో సమాజాన్ని తొలచి వేసిన ఓ అంశాన్ని నేపథ్యంగా తీసుకొని కథ అల్లుకొన్నారట. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రానికి తిరుమలశెట్టి నీలిమ నిర్మాతగా వ్యవహరిస్తారు.
పవన్ కల్యాణ్తో పంజా సినిమా తీసిన నీలిమ ప్రస్తుతం అలియాస్ జానకి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ కొత్త సినిమా సంగతులు తెలుస్తాయి.కీ, సిరా, మిథునం లాంటి సినిమాలతో అవార్డులు, ప్రసంశలు అందుకొన్న భరణి.. ఈ సినిమాతో డబ్బులూ పోగేసుకోవాలని కోరుకొందాం..