తెలుగు తెరపై బాలీవుడ్ నటుడు?
ఆయన దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తమ్ముడు ఆది పినిశెట్టి కథానాయకుడు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం మిథున్ని సంప్రదించారు. నిజానికి మిథున్కి టాలీవుడ్లో ఓ సినిమా చేయాలనే ఆలోచన లేదట. సత్య అడిగినప్పుడు - సారీ చెప్పారట.ఆ తరవాత సత్య చెప్పిన కథ విని...
తప్పకుండా నటిస్తా అని మాట ఇచ్చారట మిథున్. ``మిథున్లాంటి గొప్ప నటుడికి మా కథ నచ్చింది. దానికంటే సంతోషించదగిన విషయం మరేం ఉంటుంది? మిథున్ పాత్ర అందరికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతున్నాం`` అని సత్య పినిశెట్టి చెబుతున్నారు.