రాజమౌళికి క్రిష్ భలే షాక్ ఇచ్చాడు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడిగా ఎస్ ఎస్ రాజమౌళి గొప్ప పేరు తెచ్చుకున్నాడు.  స్టూడెంట్ నెం. 1 నుంచి ప్రాస్థానం మొదలు పెట్టిన జక్కన్న ‘బాహుబలి’చిత్రంతో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించడమే కాకుండా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అయితే బాహుబలి చిత్రం కోసం ఏకంగా రెండు సంవత్సరాలు సమయం తీసుకొని అద్భుతమైన ఫ్యూజువల్ వండర్స్ తో  తెరకెక్కించారు.  అలాంటి రాజమౌళికి ‘కంచె’ ఫేమ్ క్రిష్ పెద్ద షాక్ ఇచ్చాడు.

అసలు విషయానికి వస్తే..గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీసే ముందు ఆ చిత్రానికి సంబంధించిన కథ జక్కన్న కు చెప్పాడట క్రిష్ అయితే కథ విన్న జక్కన్న చాలా బాగుందని చెప్పడమే కాకుండా నువ్ గ్రాఫిక్స్ పై ఎక్కువ ఆధారపడితే చాలా కష్టమని గ్రాఫిక్స్ వర్క్ అంత సులభం కాదని దానికోసం చాలా కష్టపడాల్సి ఉంటుందని  ఈ సినిమా అనుకున్న సమయంలో పూర్తిచేయాలనుకుంటే నువ్ నిద్ర పోకూడదు , ఇతరులను నిద్ర పోనివ్వ కూడదు అంటూ కాస్త వార్నింగ్ ఇచ్చినట్లే ఇచ్చాడట.  

ఇక ‘బాహుబలి’ లాంటి గొప్ప సినిమా తీసిన రాజమౌళి అలాంటి మాటలు అనడంతో క్రిష్  సరైన ప్లానింగ్ తో అనుకున్న సమయానికే షూటింగ్ , గ్రాఫిక్ వర్క్ కంప్లీట్ చేసి జక్కన్నకు షాక్ ఇచ్చాడు. గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ చూసిన జక్కన్న  ఎలా చేసావని షాక్ లోనే ప్రశ్నించాడట దాంతో మీరిచ్చిన సలహాలను పాటించి పక్కా ప్రణాళిక తో చేసానని చెప్పాడట క్రిష్ .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: