ఓవర్ సీస్ దుమ్మురేపుతున్నారు..!

Edari Rama Krishna
ఈ సంవత్సరం తెలుగు ప్రేక్షకులు  రెండు సినిమాలతో నిజమైన పండుగ చేసుకున్నారు.  సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఒక్కవెలుగు వెలిగిపోయిన చిరంజీవి దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్లీ తెరపై కనిపించారు.  ఈ చిత్రం ఆయనకు 150వ చిత్రం కాగా సినిమా పేరు కూడా ‘ఖైదీ నెంబర్ 150’ కావడం విశేషం.  ఇక చిరంజీవికి అచ్చొచ్చిన సెంటిమెంట్ టైటిల్ ‘ఖైదీ’..ఈ పేరుతో వచ్చిన సినిమాలు ఒకప్పుడు బ్లాక్ బ్లస్టర్ అయ్యాయి.  చాలా గ్యాప్ తీసుకొని వివివినాయక్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ రిమేక్ గా ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటించారు.  ఈ చిత్రం అంచనాలు మించి బ్లాక్ బ్లస్టర్ అయ్యింది.  

చిరంజీవి పదేళ్ల తర్వాత నటించిన చిత్రం కావడంతో ఆ సినిమా ని చూడటానికి అమితాసక్తి కనబరుస్తున్నారు ప్రేక్షకులు . దానికితగ్గట్లు గా రైతుల సమస్య లతో ఎంటర్ టైన్మెంట్ ని జోడించి తీయడంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు అక్కడి జనాలు . ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి మహనటులు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.  గత కొంత కాలంగా ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు ఆయన ప్రాణం పోశారు.

నందమూని నటసింహం బాలకృష్ణ తన 100వ చిత్రం క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చారు.  ఈ చిత్రం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిచెప్పిన చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణిది కావడం మరోవిశేషం.  తెలుగు వారి పోరుశాన్ని చాటి చెప్పేలా ఉన్న ఈ సినిమా పట్ల అటు బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగువాళ్లు సైతం ఇష్టపడుతున్నారు.  

ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఓవర్సీస్ లో దుమ్మురేపుతున్నాయి.  చిరంజీవి చిత్రం 2 మిలియన్ డాలర్ల ని కొట్టెయ్యగా బాలయ్య వన్ మిలియన్ డాలర్ల ని దాటేశాడు . ఈజోరు ఇంకా సాగేలా ఉంది మొత్తానికి ఇద్దరు టాప్ హీరోలు నటించిన చిత్రాలు పోటీ పడగా రెండు చిత్రాలు కూడా ఘనవిజయం సాధించడంతో ఇద్దరు హీరోల అభిమానులు సంతోషంగా ఉన్నారు.

https://www.youtube.com/watch?v=kYxP_WbF2O0


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: