టీవీ యాంకర్ ఆత్మహత్య..!

Edari Rama Krishna
బాలీవుడ్ లో మరో బుల్లితెర యాంకర్ ఆత్మహత్య చేసుకుంది.  ఆ మద్య బాలీవుడ్ బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ చనిపోయిన ఘటన మరువకముందే మరో బుల్లితెర యాంకర్, మోడల్  ఖుష్బూ భట్ (27) ఆత్మహత్య కలకలం రేపింది.  వర్ధమాన మోడల్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న ఆమె జోధ్‌పూర్ లోని సుకృత్ టవర్‌ లో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం అల‌జ‌డి రేపుతోంది. ఆ ట‌వ‌ర్స్‌లో త‌న తండ్రి మనీష్‌ (59), అమ్మమ్మ(92)లతో కలిసి ఆమె ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబం  తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

వర్దమాన మోడల్‌ గా వెలుగొందుతున్న ఖుష్బూ ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. అయితే భోజనం చేసే సమయంలో తాను డయాబెటిక్ రోగినని తనకు ఎక్కువ భోజనం పెట్టకూడదని కుష్బూను కోరారని ఆమె తండ్రి చెప్పారు. దీంతో ఆమె డిప్రెషన్ కు గురైందని, వెంటనే రూమ్ లోకి వెళ్ళి తాళం వేసుకొందని తెలిపారు.  

సోమవారం మధ్యాహ్యం ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి పొరుగువారి సహయంతో రూమ్ తాళం పగులగొట్టించి చూడగా.. ఆమె ఫ్యాన్‌కు  ఉరి వేసుకుని చనిపోయినట్టు గమనించామన్నారు. అయితే కుష్బూ ఎందుకు ఆత్మహత్యకు గలకారణాలను ఆరా తీస్తున్నామని,    సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు  లభించలేదని పోలీసులు చెప్పారు.ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆమె సోదరుడు వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: