అప్పుడు ప్రభాస్ కి నా నటన నచ్చలేదు...!!

Shyam Rao

పేరుకు పంజాబీ అమ్మాయే అయినా ఆమె అందంలో తెలుగుతనం ఇట్టే ఇట్టిపడుతుంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ లో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో రాకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. మొదట ఢిల్లీ లో 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ చేసిన ఈ సుందరి ఆ తరువాత సినీ పరిశ్రమలోకి లోకి అడుగుపెట్టింది. అందం, అందానికి తగ్గా అభినయం ఆమెకు ఉండడంతో దర్శకులు కూడా రకుల్ పై సినిమా తీయడానికి ఆసక్తి కనబరిచారు.



తెలుగులో మొదట వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయి, మొదటి సినిమాతోనే ప్రక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దు గుమ్మకు మొదట దక్షిణ భారత దేశంలో ఒక తెలుగు సినీ పరిశ్రమ ఉందని అసలు తెలియదట. పాకెట్ మనీ కోసం ఒక కన్నడ సినిమాలో నటించాను. ఆ తరువాత పూరీ రకుల్ కి ఒక సినిమా కథ చెప్పారట. కానీ వయసు చిన్నది అవడంతో, చదువు పాడవుతుందని ఆ ఆఫర్ ని రకుల్ రిజెక్ట్ చేసిందట.



ఆ తర్వాత కెరటం అనే సినిమాలో నటించిందట. ఆ తర్వాత సినిమాలపై ఎక్కువ దృష్టి సారించడంతో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అయితే ఆ సినిమా షూటింగ్ నాలుగు రోజులు తీసిన తర్వాత ప్రభాస్ కి నా నటన నచ్చక తీసివేసారని చెప్పింది ఈ పంజాబీ ముద్దు గుమ్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: