ఎన్టీఆర్ ని తిట్టిందట..ఎవరో తెలిస్తే షాక్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీర్.  తండ్రి నందమూరి హరికృష్ణ వారసుడిగా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్..రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో హీరోగా మారారు.  తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ గత రెండు సంవత్సరాల నుంచి వరుస హిట్స్ తో దూసుకు వెళ్తున్నాడు.  తాజాగా బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రంలో ఎన్టీఆరా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.  ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.

ఈ మద్య ఎన్టీఆర్ ఓ ఆసక్తికర విషయం ఫ్యాన్స్ కి చెప్పారు. ఆ మద్య ఎన్టీఆర్ ఓ చిన్న పొరపాటు చేసినంతుకు ఆయన భార్య లక్ష్మీ ప్రణతి తిట్టిందట. ఇంతకీ మనోడు చేసిన పొరపాటు ఏంటో తెలుసా..ఎన్టీఆర్ తన తనయుడు అభయ్ కి స్నానం చేయిస్తున్న సమయంలో స్లిప్ అయి కింద పడిపోయాడట ! అంతే ...... అభయ్ కిందపడటం తో ఒక తల్లిగా తట్టుకోలేక పోయింది లక్ష్మి ప్రణతి వెంటనే కోపం తో ఊగిపోతూ ఎన్టీఆర్ ని తిట్టేసిందట. ఇక లక్ష్మి ప్రణతి తిడుతున్నంత సేపు చూస్తూ ఉండిపోయాడట .  

ఇక ఎన్టీఆర్ అయితే భార్య తనని తిట్టినదాని కంటే ఎక్కడ కొడుక్కి గాయాలు అయ్యాయో ! అన్న ఆందోళన తో ఉన్నాడట ఆ సమయంలో అయితే అభయ్ కిందపడ్డాడు కానీ పెద్దగా దెబ్బలు తగల్లేదట. ఏ తల్లి అయినా తన తనయుడికి ఏ చిన్న ప్రమాదం జరిగినా ఎదుటి వారు ఎంతటి వారైనా దుమ్ముదులుపుతారు..ఇది జగమెరిగిన సత్యం.  మొత్తానికి తనయుడకి ఏమీ కాకపోవడంతో ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతి కూడా ఊపిరి పీల్చుకున్నారట.  ఈ విషయాన్నీ ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: