హీరో ఉదయ్ కిరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత మనసంతా నువ్వే చిత్రంతో లవర్ బాయ్ గా మంచి పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు.  చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు.  చిరంజీవి కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా   కొన్ని కారణాల వల్ల పెళ్ళి కార్యరూపం దాల్చలేదు.

దీంతో ఎంతో మనస్థాపం చెందిన ఉదయ్ కిరణ్ తనకు వద్దకు వచ్చి బోరున విలపించాడని అంటున్నారు నటి సుధ.  ఉదయ్ కిరణ్ నాకు కొడుకు లాంటి వాడని అయితే దత్తత తీసుకుందామని అనుకున్నాను కానీ ఈలోపే ఆత్మహత్య చేసుకొని మరింత షాక్ ఇచ్చాడని అంటోంది సీనియర్ నటి సుధ . తల్లిగా , వదినగా పలు రకాల పాత్రలను పోషించి తెలుగు తెరమీద తనదైన ముద్ర వేసిన నటి ఈ సుధ.  

ఇండస్ట్రీలో చిరంజీవి, నాగార్జున మంచి నటులే కాక మానవత్వం కలిగిని వ్యక్తులు అని అభివర్ణించింది.  గతంలో తాను కొన్ని ఇబ్బందుల్లో ఉన్నపుడు నాగార్జున తనకు ధైర్యం చెప్పడమే కాకుండా ఇబ్బందులన్నీ తొలగించాడని అందుకు ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటానని అన్నారు. అంతేకాదు ఇప్పుడు తల్లి పాత్రలు అంతగా ప్రాధాన్యత లేకుండా పోయాయని కూడా చురకలు వేసింది సుధ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: