తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని నాగార్జున. ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి మన్మధుడు, కింగ్ నాగార్జున్ అని పేరు తెచ్చుకున్నారు. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నాగచైతన్య పది సంవత్సరాల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రేమ కథా చిత్రాలకు పెద్ద పీట వేసిన నాగచైతన్య ఈసారి మంచి కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నారు.
యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కళ్యాణ్కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్ ..వేడుక చూద్దాం'. ఈ సినిమా మే 26న విడుదలవుతుంది. సినిమా అంతా టీం వర్క్ గా కొనసాగిందట. జి.కె.మోహన్, సత్యానంద్గారు, దేవిశ్రీ ప్రసాద్ సహా అద్భుతమైన వర్క్ ఔట్ పుట్ ఇచ్చారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సమయంలో కూడా సత్యానంద్గారు సపోర్ట్ అందించారు. దేవిశ్రీనైతే ఎడిటింగ్లో కూడా ఇన్వాల్వ్ చేయించాను.
ఈ చిత్ర థ్రియేట్రికల్ ట్రైలర్ను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో రకుల్ప్రీత్ సింగ్ను ఉద్దేశించి చైతూ చెప్పిన పై డైలాగ్ ఆకట్టుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ నెల 26న ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నాగ చైతన్య.