టీవీ టీఆర్పీ ఉతికి ఆరేసిన చిరంజీవి

KSK

తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాన సారథ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటించారు. అప్పటి వరకు చిరు స్టామినా పై రక రకాలు గా చర్చించిన వారు ఈ సినిమా చూసి మైండ్ బ్లాక్ అయ్యింది.  నిజంగా చిరంజీవి పది సంవత్సరాల క్రితం శంకర్ దాదా జిందాబాద్ లో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారని..బాస్ ఈజ్ బ్యాక్ అంటూ బ్రహ్మరథం పట్టారు.  


ఆదివారం నాడు మన జనాలు ఇంట్లో ఉన్నందరూ ఒకదగ్గరకు చేరి కలిసి  టివి చూడటం మనకు తెలుసు. మొన్న సండే చిరు తాజా సినిమా ‘ఖైదీ 150’ టివిలో వేశారు. ఒక చానెల్ లో IIFA ఉత్సవం ప్రసారం అవుతున్నా.. మరొక చానల్లో జక్కన్న రాజమౌళి ఇంటర్యూ వస్తున్నా.. అందరూ చూసింది మాత్రం ‘స్టార్ మా’ లో ప్రసారమైన ‘ఖైదీ 150’ సినిమానే అని రేటింగులు చెబుతున్నాయి.


సరే రేటింగుల సంగతి పక్కనెట్టేస్తే.. ఫ్యాన్స్ కోసం స్టార్ మా ఏం చేసిందో తెలుసా?  ఖైదీ 150లో బాగా జనారాధన పొందిన పాటలు ‘రత్తాలు రత్తాలు’ మరియు ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పాటలను రెండుసార్లు ప్లే చేశారు టివి వీక్షకులు కోసం. టివి బ్రాడ్ కాస్ట్ చరిత్రలో ఇదే మొదటిసారి ఇలా జరగడం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: