బన్నీ అభిమానులను భయపెడుతున్న ఓవర్సీస్ టాక్ !

Seetha Sailaja
వరుస సక్సస్ లుతో మంచి జోష్ లో ఉన్న అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’  మొదటిరోజు మొదటి షో ఓవర్ సీస్ టాకే బయటకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా అమెరికాలో ప్రీమియర్ షోలు సాయంత్రం 6గంటలకు ప్రారంభం అవుతూ ఉంటాయి. అయితే ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకు సంబంధించి అమెరికాలోని మొట్టమొదటి ప్రీమియర్ షో మధ్యాహ్నం 2.30 లకే ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. 

మన భారత కాలమాన ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు అమెరికాలో ‘దువ్వాడ’ మొదటి ప్రీమియర్ షో పడింది అని అంటున్నారు. దీనితో ఈ షోకు సంబంధించిన టాక్ బయటకు వస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ బాగా ఉన్నా సెకండ్ ఆఫ్ వచ్చేసరికి ఎబో ఎవరేజ్ టాక్ ను మాత్రమే తెచ్చుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు టాప్ హీరోల సినిమాలకు విడుదలకు ముందుగానే రేటింగ్స్ ఇచ్చే దుబాయ్ కి చెందిన ఉమైర్ సందు ఈ మూవీకి ఎవరేజ్ రేటింగ్ ఇవ్వడం బన్నీ అభిమానులను మరింత టెన్షన్ పెడుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముందే దాదాపు 78 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీని కొనుక్కున్న బయ్యర్లు గట్టెక్కాలి అంటే కనీసం ఈ మూవీకి 80 కోట్ల నెట్ కలక్షన్స్ రావాలి అన్న మాటలు వినిపిస్తున్నాయి.

హిమాలయ శిఖరం అంత ఎత్తైన ఈ టార్గెట్ ను అల్లు అర్జున ‘దువ్వాడ’ అందుకోవాలి అంటే ఈ మూవీ మొదటి రోజు మొదటి షో నుండి ఎటువంటి డివైడ్ టాక్ లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా మారాలి. అయితే కనీవినీ ఎరుగని రీతిలో ‘దువ్వాడ జగన్నాథం’ అడ్వాన్స్  బుకింగ్ కు ఏర్పడిన క్రేజ్ ను పరిశీలిస్తున్న విశ్లేషకులు ఈ మూవీ బన్నీ కెరియర్ లో మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా మారడం తథ్యం అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఫలితం మరి కొద్ది గంటలలో తేలిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: