ద్రౌపతిగా నయనతార..!

Edari Rama Krishna
తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించి ఇప్పటికీ గ్లామర్ హీరోయిన్ గా వెలిగిపోతుంది నయనతార.  తెలుగు అగ్రహీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఎంత గ్లామర్ క్విన్ గా పేరు తెచ్చుకుందో..అంతే వివాదాలు తనని చుట్టుముడుతూ వచ్చాయి.  అప్పట్లో శింబు, ప్రభుదేవ లతో ప్రేమాయణం కొనసాగించిన ఈ అమ్మడు ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ ప్రేమలో మునిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.  తాజాగా భారతీయ ఇతిహాసాలు రామాయణం, మహాభారతం గురించి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు, సిరియల్స్ వచ్చాయి.  

అయితే ఇప్పుడు అత్యంత అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి మహాభారతం చిత్రం తెరకెక్కే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పలు భాషలకు చెందిన ప్రముఖులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. సుమారు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌లో రూపొందనుంది.  మరోవైపు కన్నడంలో కూడా భారీ బడ్జెట్ తో ఎంటీ.వాసుదేవన్‌ రాసిన ‘రెండముళం’ అనే నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి నాగన్న దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రానికి ‘కురుక్షేత్ర’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో దుర్యోధనుడిగా దర్శన్, కర్ణుడిగా రవిచంద్రన్, భీష్ముడిగా సీనియర్‌ నటుడు అంబరీష్‌ నటించనున్నారు. ఇక కురుక్షేత్రానికి కీలక పాత్రధారిని పాంచాలిగా దక్షిణాది  అగ్రనాయకి నయనతారను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

తెలుగు లో బాలకృష్ణ తో  ‘శ్రీరామరాజ్యం”లో సీతగా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.  ఇప్పుడు పాంచాలిగా ‘కురుక్షేత్ర’ చిత్రంలో నటించి మెప్పించగలదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్.  అంతే కాదు నయనతార ఇప్పటికే “సూపర్‌” అనే చిత్రం ద్వారా కన్నడ సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: