‘బిగ్ బాస్ ’ పరమ చెత్త షో అంటున్న నటి..!

Edari Rama Krishna
ఇప్పటి వరకు భారత దేశంలో ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్, టాలెంట్ ప్రోగ్రామ్స్ చూశాం.  అయితే మొదటి సారిగా కొంత మంది సెలబ్రెటీలను ఒకే చోట ఉంచి వారి చుట్టూ కెమెరాలు పెట్టి వారి ప్రతి కదలికను రికార్డు చేస్తూ చూపించే ప్రోగ్రామ్ ‘బిగ్ బాస్’ షో.  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ సాధించింది.  దీంతో ఈ ప్రోగ్రామ్ ని తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా తీసుకు వచ్చారు.  ఇక తెలుగు  బుల్లితెరపై మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ నెల 16 నుంచి రాబోతుంది.  

అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ బిగ్ బాస్ షో ఓ చెత్త ప్రోగ్రామ్ అని విమర్శించారు..నటి, దర్శకురాలు.    తమిళ నటి , దర్శకురాలు అయిన లక్ష్మీ రామకృష్ణన్  ‘బిగ్ బాస్’ షో పరమ చెత్త ప్రోగ్రామ్ అని ఇలాంటి స్టార్ హీరోలు ఎందుకు చేస్తున్నారో అస్సలు అర్థం కావడం లేదని విమర్శించారు.  ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల కుటుంబంలో మనస్పర్థలు చెలరేగడం ఖాయమని ఆ షో మన భారతీయతకు చెడ్డ పేరు తీసుకు వచ్చే షో అని మరీ ముఖ్యంగా దక్షిణాది వాళ్లకు మరింత చేటు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.  

వ్యక్తి మనోభావాలు దెబ్బ తింటాయని..స్వేచ్చగా బతికే వాళ్ల ను బంధించినట్లు అవుతుందని ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడటం వల్ల కుటుంబ సభ్యుల్లో కూడా అభిప్రాయ భేదాలు రావొచ్చని అంటున్నారు.  అంతే కాదు బిగ్ బాస్ షోలో నన్ను పాల్గొనమని కోరారని కానీ నేను మాత్రం పది కోట్ల రూపాయలు ఇచ్చినా చేయను అని ఖచ్చితంగా చెప్పానని అంటోంది.ఆడ , మగ అనే తేడా లేకుండా అపరిచితులతో కలిసి బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలి . రెండు నెలల పాటు సాగే ఈ వ్యవహారం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బ తింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: