రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న త్రిష 'గర్జనై'..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరోయిన్ త్రిష.  అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.  హీరో ప్రభాస్ సరసన వచ్చిన వర్షం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తర్వాత అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా వెలిగిపోయింది.  తెలుగు, తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన త్రిష ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు దాటినా ఇప్పటికీ గ్లామర్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

 ఇప్పటి వరకు  క్రేజ్ తగ్గకుండా చూసుకుంటోన్న కథానాయికలలో నయనతార తరువాత త్రిష కనిపిస్తుంది.  ఇండస్ట్రీలో త్రిషపై ఎన్నో వివాదాలు ఉన్నా..నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి.  తాజాగా ఈ అమ్మడు ‘గర్జనై’ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.   రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు నటించని యాక్షన్ సీక్వెన్స్ లో త్రిష కనిపించబోతుంది.  

ఆ మద్య వచ్చిన కమల్ చిత్రం ‘చీకటి రాజ్యం’ లో కూడా త్రిష ఓ ప్రదాన పాత్రలో కనిపించింది.  'గర్జనై' చిత్రంలో ఛేజింగులు .. అడవుల్లో పరుగులు ఒక రేంజ్ లో ఉంటాయనీ .. ఈ ఫోటో అందుకు సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు ఒకటి రివీల్ అయ్యింది.  సాంకేతికపరంగా ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని చెబుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను అక్టోబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: