టాలీవుడ్లో కలకలం రేపుతోన్న డ్రగ్స్ కేసులో ఈ రోజు దర్శకుడు పూరీ జగన్నాథ్ను విచారిస్తోన్న అధికారులు రేపు హీరోయిన్ ఛార్మీని ప్రశ్నించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు మద్దతుగా ఉన్న తన తండ్రికి, తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ఛార్మీ ఈ రోజు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తోంది. తన కూతురు మంచిదని, 13 ఏళ్ల నుంచే ఛార్మీ సినీ రంగంలో ప్రతిభ చాటుతోందని ఆమె తండ్రి దీప్సింగ్ ఉప్పల్ తెలిపారు.
చిన్న నాటి నుంచే కుటుంబానికి అండగా ఉంటోందన్నారు. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలతో నా కుమార్తె తీవ్రంగా కలత చెందింది. ఒకవేళ ఛార్మీకి డ్రగ్స్ అలవాటు ఉంటే ఇంత కాలం ఇండస్ట్రీ లో కొనసాగుతుందా? తనకు ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొనే సమయం లేదు. ఛార్మీ తన తదుపరి చిత్రం పైసా వసూల్ తో బిజీ గా ఉంది.
ఛార్మీ తన తదుపరి చిత్రం పైసా వసూల్తో బిజీగా ఉంది.
అయితే ఒకరిపై ఆరోపణలు చేస్తూ వార్తలు రాసేటప్పుడు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక నాకు పూరీ జగన్నాథ్ వ్యక్తిగతంగా తెలుసు. పూరీ ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు.త్వరలోనే క్లీన్చిట్ వస్తుందని అప్పుడే అందరికి సమాధానం దొరుకుంది.’ అని ఛార్మి తండ్రి వ్యాఖ్యానించారు.
ఆమెకు డ్రగ్స్ అలవాటు లేదని ఆమె తండ్రిన చెప్పిన విషయాన్ని పలు వెబ్సైట్లు ప్రచురించాయి. ఆయా వార్తలన్నింటినీ ఛార్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తోంది. ఆ వార్తలను ప్రచురించిన వెబ్సైట్లను మెచ్చు కుంటున్నానని పేర్కొంది. కాగా, డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ను అధికారులు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు.
కాగా డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 20న ఛార్మీ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.