చార్మీ వల్లే మా ఆయనకు ఈ దుస్థితి..పూరీ భార్య సంచలన వ్యాఖ్యలు...!!

Shyam Rao

డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పూరీ జగన్నాథ్. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద దర్శకుడిగా చెలామణి అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న సిట్ అధికారులు పూరీని ఇంటరాగేషన్ చేసిన తర్వాత పూరీ సోషల్ మీడియా లో ఒక వీడియో పోస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో మీడియా తన జీవితాన్ని నాషన్ చేసిందని తనకు లేనిపోని అలవాట్లు ఉన్నాయని ఆరోపిస్తూ వార్తలు ప్రసారం చేసిందని అందుకు తన భార్యా పిల్లలు ఏడుస్తున్నారంటూ ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేయడం జరిగింది.



అయితే తన భర్త చాలా మంచివాడని తను ఇలా ఈ కేసులో ఇరుక్కోవడానికి కారణం సినీ నటి చార్మీ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని ఆయన భార్య లావణ్య తనకు తెలిసిన పరిశ్రమ పెద్దల వద్ద బాధపడినట్టు తెలుస్తోంది.  తన భర్తను వాడుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు చార్మి యత్నించిందని, ఆమె మత్తులో పడిన పూరీ ఆసలు సమస్యను విస్మరించాడని చెప్పినట్టు తెలుస్తోంది.



ఆ రాక్షసితో కలవద్దని చెప్పినందుకు ఇంటికి రావడం కూడా మానేశాడని లావణ్య వాపోయిందట. చార్మీతో ఉన్న అనుబంధం కారణంగానే తన భర్త ఫెయిల్యూర్ల బాటలో ఉన్నాడని, ఆర్థికంగా దెబ్బతిని, సర్వనాశనం కావడానికి కూడా ఆమే కారణమని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంత రాద్ధాంతం అవుతున్నా, తన కుటుంబ జీవితం చెడిపోరాదన్న ఉద్దేశంతో భర్తను ఒక్క మాట కూడా అనలేదని లావణ్య చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు లావణ్య వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: