నమ్మినోడే నడివీధిలో పెట్టాడు.. కాపాడండి ప్లీజ్..!!

Vasishta

          మళయాళంలో ప్రముఖ నటి మైథిలి. మంచి సింగర్ కూడా.! మైథిలికి 2008లో కిరణ్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం అయింది. ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. మైథిలికి నచ్చడంతో ఇద్దరూ కలిసి తిరిగారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వాళ్లిద్దరూ ప్రేమికులుగానే గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే చాలా చోట్లకు వెళ్లారు. ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు.


          అయితే.. మైథిలికి చావు కబురు చాలా లేటుగా తెలిసింది. కిరణ్ కుమార్ కు ఆల్రెడీ పెళ్లయిందని మైథిలికి తెల్సిపోయింది. దీంతో తనకు మోసం చేశాడని గ్రహించి అప్పటి నుంచి దూరం పెట్టింది. అయితే – అప్పుడే కిరణ్ కుమార్ రెండో యాంగిల్ బయటపెట్టాడు. బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ప్రైవేటు ఫోటోలు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు సహకరించకపోతే ఫోటోలు సోషల్ మీడియాలో పెడ్తానని బెదిరించాడు. చివరకు రూ.75 లక్షలు ఇస్తే వదిలేస్తానని.. లేకుంటే ఫోటోలు బయట పెట్టేస్తానన్నాడు. తన దగ్గర అంత డబ్బులేదని మైథిలి చెప్పడంతో కొన్ని ఫోటోలను బయటపెట్టాడు.       


దీంతో మైథిలి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కిరణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఈ వ్యవహారం వెనుక కిరణ్ కుమార్  కాకుండా మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైథిలి ఫోటోలను షేర్ చేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: