రోజా సారీ ఆమె ఎవరో నాకు తెలియదు..!

Edari Rama Krishna
ఈ మాటలు అంటుంది ఎవరో కాదు తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు,బాబు మోహన్ లాంటి వారితో పోటీ పడి కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ వేణు మాధవ్.  మిమిక్రీ ఆర్టిస్టు గా కెరీర్ మొదలు పెట్టిన వేణు మాధవ్ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలో హీరోగా కూడా నటించాడు.  గత కొంత కాలంగా వేణు మాధవ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  

అయితే ఆయన సినిమాల్లో రాకపోవడానికి ఆనారోగ్యకారణమే అని పుకార్లు షికార్లు చేశాయి.  ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో నటిస్తున్న వేణు మాధవ్ తాజాగా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్లారు.  

ఈ సందర్భంగా విలేకరులు మీరు నంద్యాలలో ప్రచారానికి రావడం వెనుక టీడిపీ వ్యూహం ఏంటీ..ఎమ్మెల్యే రోజాకి కౌంటర్ గా మిమ్మల్ని ప్రచారానికి దింపారా అన్ని ప్రశ్నకు సమాధానం చెబుతూ..అసలు రోజా ఎవరూ..?  సారీ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు కమెడియన్ వేణుమాధవ్.

 నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ వద్ద పనిచేశానని..టీడిపి ఆఫీస్ లో పనిచేశానని అందుకే టీడిపి అంటే నాకు వల్లమాలిన అభిమానం అని న్నారు. అంతే కాదు గతంలో నాకు భూమ ఫ్యామిలీ తో ఎంతో అనుబంధం ఉందని అందుకే ఈ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను  అని చెప్పుకొచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: