సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు దాదాపుగా ప్రేమ వివాహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా ఈ లీస్టు లో చేరిపోయింది..ప్రముఖ మళియాళ నటి ప్రియమణి. గత కొంత కాలంగా గాఢంగా ప్రేమించిన తన ప్రియుడు ముస్తఫారాజ్ తో పెళ్లి బుధవారం సింపుల్గా రిజిస్ర్టార్ ఆఫీసులో జరిగింది. తాము విభిన్న మతాలకు చెందిన వాళ్లమని, అందుకే సంప్రదాయబద్ధంగా కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నామని సినీనటి ప్రియమణి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చినట్లు సమాచారం. వీరి రిసెప్షన్ మాత్రం రేపు సాయంత్రం బెంగళూరులో ఘనంగానే జరగనుంది. ఇక సంగీత్, మెహందీ ఫంక్షన్లో తీసిన ఫొటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రియమణి రెడ్ కలర్ దుస్తుల్లో మెరిసింది. ఈ జంట ఆగస్ట్ 24న రిసెప్షన్ ఏర్పాటు చేసింది.
బెంగళూరులో గురువారం సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ నుంచి నటీనటులు హాజరుకానున్నారు.ఇక రిసెప్షన్ జరిగి రెండురోజుల తర్వాత ఈ అమ్మడు షూటింగ్కి వెళ్ళనుంది. మోలీవుడ్లో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. ఇంతకీ హనీమూన్ ఎక్కడంటూ సినీ లవర్స్ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.