అసహనంలో మహేష్ బాబు..అందుకే ఆ నిర్ణయం..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘శ్రీమంతుడు’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే. మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.  గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ది చేసే యువకుడిగా మహేష్ నటన కు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. శ్రీమంతుడు చిత్రంలో అద్భుతమైన సోషల్ మెసేజ్ కి ఎంతో మంది స్ఫూర్తి పొందడమే కాకుండా గ్రామాలను దత్తత కూడా తీసుకున్నారు. 

ఈ చిత్రం తర్వాత మహేష్ ‘బ్రహ్మోత్సవం’ లో నటించారు..కుటుంబ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం అభిమానులకు పెద్దగా రుచించలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక తమిళ స్టార్ దర్శకులు మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ చిత్రంలో నటించారు మహేష్.  ఈ చిత్రం మొదటి నుంచి నత్తనడకన సాగుతూ వచ్చింది..షూటింగ్ చాలా సమయం తీసుకుంది.  అయినా భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ‘స్పైడర్’ కి మిశ్రమ స్పందన వచ్చింది.  కాకపోతే కలెక్షన్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. 

స్పైడర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేష్ అంచనాలు అందుకోకపోవడంతో అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ‘భరత్ అనే నేను’ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నాడట . సంక్రాంతి కాకుండా వేసవిలో సినిమాని రిలీజ్ చేసేట్లుగా ప్లాన్ చేస్తున్నాడట.

ఇప్పటికే సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు వస్తున్నట్లు ప్రకటించారు..ఇదే సమయంలో ఆ సినిమాలకు పోటీగా తన సినిమా వస్తే కలెక్షన్ల పరంగా దెబ్బ పడుతుందని భావించి కాస్త సమయం తీసుకొని సోలో గా వస్తే బెటర్ అని డిసైడ్ అయ్యారట భరత్ అనే నేను చిత్ర బృందం . అందుకే ఈనెల 6నుండి జరగాల్సిన ఫారిన్ షెడ్యూల్ కూడా కొద్దిరోజులు వాయిదా వేశారట. 

మహేష్ సరసన కైరా అద్వానీ  నటిస్తుంది..ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు . శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ - మహేష్ బాబు ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: