తెలుగు ఇండస్ట్రీపై కైకాల సంచలన వ్యాఖ్యలు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఆ తరం మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు  సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ.  సాధారణంగా ఎలాంటి కాంట్రవర్సీలకు పోని కైకాల సత్యనారాయణ తాజాగా టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటులు అంటే కైకాల, జమున, కాంచన ఇలా చాలా తక్కువ మందే బతికి ఉన్నారు. 

ఈ మద్య ఓ చానల్ తో మాట్లాడుతూ..నాడు కళలు, కళాకారుల కోసమే సినీ పరిశ్రమ పనిచేసిందని, ఇప్పుడు కమర్షియల్‌గా మారిందంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.  దర్శకులు, నిర్మాతలు అంటే నటీ, నటులు ఎంతో గౌరవించే వారని..ఇండస్ట్రీలో ఎవరిక కష్టం వచ్చినా తమదిగా భావించి వారికి వెన్నుదన్నుగా నిలిచే వారని..ఇప్పుడు అలాంది అసలు కనిపించడం లేదని అన్నారు. 

అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఎవర్నీ విమర్శించేందుకు కాదని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించానని..తన సినీ కెరీర్‌పై ఎలాంటి అసంతృప్తి లేదని అన్నిరకాల క్యారెక్టర్లలో ప్రేక్షకులు తనను ఆదరించారని గుర్తుచేశారు. 

ఇండస్ట్రీలో గొప్ప గొప్ప నటులతో నటించానని..విభిన్న రసాలను పండించడం వల్ల నవరస నట సార్వభౌమ బిరుదు ఇచ్చారన్నారు.  అయితే అన్నగారు ఎన్టీఆర్  టీడీపీని స్ధాపించిన వారిలో తాను ఒకడినని, తనను సొంత తమ్ముడికంటే ఎక్కువగా ఎన్టీఆర్ ఆదరించారని అన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: