‘సైరా నరసింహారెడ్డి’ లో అదిరిపోయే డైలాగ్స్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత ‘ఖైదీ నెంబర 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఠాగూర్ లాంటి గొప్ప హిట్ ఇచ్చిన వివివినాయర్ దర్శకత్వంలో చిరు తనయుడు రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన   ‘ఖైదీ నెంబర 150’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  రైతు కోసం పోరాటం చేసే సెంటిమెంట్ ఈ సినిమాకు బాగా వర్క్ ఔట్ అయ్యింది.  ఇక చిరంజీవి కూడా తన వయసుకు తగ్గ సినిమాలే తీయాలనే ఆలోచనలో ఉన్నారు.  ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  ‘సైరా నరసింహారెడ్డి’  చిత్రంలో నటిస్తున్నారు. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఈ పేరులోనే బోలెడంత ధైర్యం ప్రతిధ్వనిస్తుంటుంది. ఈయన పేరు ప్రస్తావిస్తే చాలు రేనాటి ప్రజల గుండె ధైర్యం ఎలా ఉంటుందో కనిపిస్తుంది.  అంత గొప్ప మహావీరుడి గాధ ఇప్పుడు మెగాస్టార్ చిరు తన 151 వ సినిమాగా చేస్తున్నారు. అప్పటి ప్రజల జయ జయ ద్వానమైన సై సైరా నరసింహారెడ్డి నుండే చిత్రానికి ‘సైరా నరసింహారెడ్డి’ అనే  పేరు పెట్టడం విశేషం. 

భారత దేశాన్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకున్న బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడ గడలాడించిన పోరాట వీరుడు అంటే  గంభీరమైన ఆహార్యంతో పాటు ఒళ్ళు గగుర్పొడిచే మాటలు కూడా ఉండాలి.  దీనికోసం చిరంజీవి పూర్తిగా సంసిద్దుడు అయ్యారు...ఇక ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రాను ప్రాజెక్టులోకి తీసుకుని పవర్ ఫుల్ డైలాగ్స్ రాయిస్తున్నారట.

సాయి మాధవ్ కూడా అప్పటి చరిత్రను కూలంకషంగా పరిశీలించి నరసింహారెడ్డి పౌరుషం ఉట్టిపడేలా మాటలు రాస్తున్నారట. అలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ తెరపై చిరంజీవి చెబుతుంటే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఆనంద పడతారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: