తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ముందుకు సాగుతున్నారు. కాకపోతే ఆ మద్య ‘సరైనోడు’ఫంక్షన్లో అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అన్న విషయానికి పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ దెబ్బతో బన్నీకి ఉన్న ఇమేజ్నే కాస్త డ్యామేజ్ అయ్యింది. ఆ ప్రభావం చిరు 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా కనిపించింది. సాధారణంగా మెగా ఫంక్షన్ అనగానే పవన్ గురించి చెప్పమని గోల గోల చేసేస్తూంటారు. ఈ విషయంలో ఆ మద్య మెగాబ్రదర్ నాగబాబు కూడా ఫ్యాన్స్ పై సీరియస్ అయ్యారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్ కమింగ్ హీరో సాయిధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. తాజాగా జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ తనకెంత ఇంపార్టెంటో చెప్పాడు.
చిరు అభిమానులకు, పవన్ అభిమానులకు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ అభిమానులందరికీ నమస్కారాలు అంటూ స్పీచ్ మొదలు పెట్టాడు. అదే సమయంలో కొంత మంది ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అంటూ నినాదాలు చేశారు..అప్పుడు వెంటనే స్పందించి.. "ఎస్.. డెఫినెట్లీ.. ఆయన మా ఇంటికి జవాను. నాకు ధైర్యంగా ఉండటం నేర్పించి.. నన్నొక జవానుగా తయారు చేసింది పవన్ కల్యాణ్ గారు. ఇవన్నీ పక్కన పెడితే.. నేను ఇవాళ ఈ స్టేజి మీద నిలుచోవడానికి కారణం.. మా ముగ్గురు మామయ్యలు.
నాకు ఎప్పటికీ వాళ్లింటి ముందర నేను జవానులా నిలబడతాను అంటూ సంస్కారవంతంగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ గారికి ముందు నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. ఎవరికీ రాని గుర్తింపు ఆయన వచ్చింది..లండన్ లో అవార్డు ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు. కాబట్టి ముందుగా ఆ జవాన్కి సెల్యూట్." అని పేర్కొన్నారు సాయి ధరమ్. గతంలొ కూడా ఒక ఈవెంట్లో ఇలాగే పవన్ అభిమానులను ఆకట్టుకున్నాడు సాయిధరమ్ తేజ్.