నాగార్జునకు షాక్ ఇచ్చిన సమంత జోక్ !
తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున తన కోడలు సమంత తనను ఎలా ఆట పట్టించిందో అన్న విషయాన్ని తెలియ చేసాడు. ఈ సంక్రాంతి తనకు చాల స్పెషల్ అంటూ అఖిల్ ‘హలో’ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈసినిమాలో అతడి నటనకు మంచి ప్రశంసలు రావడం చూసి తండ్రిగా తాను ఆనంద పడిన విషయాలను బయట పెట్టాడు.
ఇదే సందర్భంలో అఖిల్ సినిమాల పరాజయాల గురించి మాట్లాడుతూ తనకు కూడ కెరియర్ తొలినాళ్ళలో నాలుగు వరస పరాజయాలు వచ్చాయని పరాజయాలు వచ్చినప్పుడే మనలోని కసి పెరుగుతుంది అంటూ అఖిల్ ప్రస్తుతం ఆ కసిలో ఉన్నాడు అంటూ కామెంట్స్ చేసాడు నాగార్జున. ఇదే సందర్భంలో తన కోడలు సమంత ఇంట్లోకి అడుగు పెట్టిన వేళ నుంచి అక్కినేని ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది అంటూ సమంతను ఆకాశంలోకి ఎత్తేశాడు.
ఈ సందర్భంలో తమ కుటుంబంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియో స్టార్ట్ చేసి 42 ఏళ్లు అయిన సందర్భంలో తన స్టూడియో వర్కర్స్ అందరికి తన కొత్త కోడలు సమంత భోజనాలు పెట్టిందని చెప్పాడు. ఈ సందర్భంగా తామంతా కలిసి భోజనం చేసినట్లు కూడ చెప్పాడు. ఆ సందర్భంగా ఏవేవో జోక్స్ తమ మధ్యలో వచ్చాయని సమంత అయితే ‘మై హస్బెండ్ ఈజ్ ది బెస్ట్’ అని వ్యాఖ్యానించిందని ఆమాటలకు తామంతా నవ్వుతూ ‘మేమంతా మా భార్యలకు మంచి హస్బెండ్స్ కాదా ?’ అని అడిగామని చెప్పాడు నాగార్జున.
దానికి సమంత రియాక్ట్ అవుతూ ‘లేదు..లేదు.. మై హస్బెండ్ ఈజ్ ది బెస్టెస్ట్’ అంటూ చెప్పి అందరిని ఆటపట్టించిన విషయాన్ని బయట పెట్టాడు నాగ్. ఇదే సందర్భంలో నాగార్జున సంక్రాంతి సరదాలు గురించి మాట్లాడుతూ తమ ఇంటిలోని పిల్లలు అంతా హైదరాబాద్ లోని చింతల్ బస్తీ ఏరియాలో కలిసి గాలిపటాలు ఎగరవేయడం ఎవరిదైనా కైట్ కట్ అయితే వెంటనే డప్పులు కొట్టి డాన్స్ చేసిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఇప్పటి తరం పిల్లలు అటువంటి సంక్రాంతి సరదాలకు దూరంగా ఉంటున్నారు అంటూ అభిరుచులలో వచ్చిన మార్పుల పై తన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు నాగార్జున..