నా ప్రియమైన భార్యకు అంటూ..మహేష్ ట్విట్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా మారారు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించకున్నా..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.  ఇక అప్పటి నుంచి మాస్, క్లాస్ ఇమేజ్ తో హీరో నెంబర్ దూసుకు వెళ్తున్నారు.

గత సంవత్సరం ‘స్పైడర్ ’ తో కాస్త నిరాశ పరిచినా..ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి.  హీరోగా ఎంత బిజీగా ఉన్నా మహేష్ బాబు తన కుటుంబం గురించి ఎంతో శ్రద్ద తీసుకుంటారు. వీలు దొరికినప్పుడల్లా వీదేశీ టూర్లకు వెళ్తూ తన భార్యా, పిల్లతో ఎంజాయ్ చేస్తుంటారు.

ఈ రోజు మాజీ నటి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఇవాళ 46వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలను తెలిపాడు మహేశ్ బాబు. "నా జీవితంలో నువ్వు చాలా స్పెషల్. హ్యాపీ బర్త్‌డే మై లవ్, మై బెస్ట్ ఫ్రెండ్, బై వైఫ్" అంటూ విషెస్‌ను చెప్పారు.

ఈ సందర్భంగా ఒక ఫొటోను కూడా షేర్ చేశాడు మహేశ్ బాబు. కాగా 1993లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్‌గా ఎన్నికైన నమ్రత.. 'అంజి' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.. మహేశ్, నమ్రతలకు 2005, ఫిబ్రవరి 10న వివాహం అయింది. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలున్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భరత్‌ అనే నేను' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
One more reason to tell you how special you are! 😊 Happy Birthday to my love, my best friend, my wife ❤ pic.twitter.com/3eDQXoKDuF

— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: