సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ఇంటెలిజెంట్ రేపు విడుదల కానుంది. టాప్ డైరెక్టర్ వివి.వినాయక్ ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన ఇంటిలిజెంట్ సినిమాపై ముందుగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే వినాయక్ లాంటి డైరెక్టర్, అది ఖైదీ నెంబర్ 150 లాంటి సినిమా తర్వాత వస్తోన్న సినిమా అయినా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక మాత్రం ముందు నుంచి ఉన్న అచంనాలు సడెన్గా పడిపోయాయి.
రొటీన్ ట్రైలర్ కావడంతో, వినాయక్ కొత్తదనం ఏం చూపించలేదన్న టాక్ రావడంతో సినిమాపై ఉన్న హైప్కు కొంత డ్యామేజ్ అయ్యింది. ఇదిలా ఉంటే ముందుగా ఇంటిలిజెంట్ ప్రీమియర్ షోలు గురువారమే ఓవర్సీస్తో పాటు హైదరాబాద్లో ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ షోలు సడెన్గా క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. తేజు చివరి సినిమాకు కూడా రిలీజ్కు ముందు రోజే హైదరాబాద్లో ప్రీమియర్లు వేశారు.
అయితే ఆ షోకు మీడియా వాళ్లతో పాటు కొందరు ఉత్సాహవంతులు కూడా వెళ్లారు. దీంతో వాళ్లు ముందుగానే రివ్యూలు పెట్టేయడంతో పాటు ఆ సినిమా చూసిన జనాలు కొందరు సినిమా టాక్పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. దీంతో తొలి ఆట పడకుండానే టాక్ బయటకు వచ్చేసింది. సినిమా యావరేజ్ అవుతుందనుకుంటే చివరికి ప్లాప్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఇంటిలిజెంట్ ట్రైలర్లకు రొటీన్ టాక్ రావడంతో వీళ్లు ముందు జాగ్రత్తగా ప్రీమియర్లు క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది.
రేపు ఉదయం షో పడేముందే సినిమా టాక్ బయటకు వస్తే ఇబ్బంది అవుతుందనే చిత్ర యూనిట్ ప్రీమియర్లు క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇంటిలిజెంట్ షోలు అన్ని శుక్రవారం ఉదయం 11 గంటల నుంచే స్టార్ట్ అవుతాయి.