నాతో ఆ వ్యాపారం చేయించాలనుకున్నాడు : అమలాపాల్

Edari Rama Krishna
తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటించిన అమలాపాల ఆ మద్య ప్రేమించి పెళ్లిచేసుకొని తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటనపై దృష్టి పెట్టిన ఈ అమ్మడు ఆ మద్య  చెన్నైలోని టీ నగర్‌లో రోజులపాటు డాన్స్ ప్రాక్టీస్ క్లాసులకు వెళ్లగా అక్కడి యజమాని అళగేశన్ తనపై లైంగిక వేధింపులు చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమలాపాల్ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అలాగేశన్‌ను వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ఈ మద్య సినిమా హీరోయిన్లపై లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయని..మళియాళ నటి భావన చేసిన పోరాటాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సినీ ఇండస్ట్రీ వర్గం అంటున్నారు.  ఈ నేపథ్యంలో సినీ నటుడు విశాల్ స్పందిస్తూ..‘ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా ఫిర్యాదు చేసినందుకు హ్యాట్సాఫ్‌. లైంగిక వేధింపులను బయటపెట్టడానికి నిజంగా చాలా తెగింపు ఉండాలి.’ అంటూ విశాల్ ట్విట్టర్ ద్వారా అమలాపాల్‌ను కొనియాడాడు.

దీనిపై స్పందించిన అమలాపాల్ విశాల్ కి ధన్యవాదాలు తెలిపింది. నా తరఫున మాట్లాడినందుకు థాంక్స్ విశాల్‌. ఇది ప్రతి మహిళ బాధ్యతగా భావిస్తున్నా. వేధింపులపై మౌనం వహించి, వదిలివేయడం సరికాదని నాకు తెలిసేలా చేశావు’ అని అమలాపాల్ బదులిచ్చింది. అళగేశన్ తనతో వ్యాపారం చేయాలనుకున్నాడని, అతడికి ఉన్న గుర్తింపు, చేసే పనులు చూసి చాలా భయపడిపోయానని ఆమె తెలిపింది.

Thank you Vishal for standing by me and assuring me that I must not let it go, and I didn’t, now I believe it’s every woman’s duty, to not let it go and stand for themselves. He was ready to trade me off like a meatloaf, his guts make me sick, his existence makes me sick #MeToo https://t.co/SEPrE4bxPr

— Amala Paul ⭐️ (@Amala_ams) February 10, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: