మెహ‌బూబా షూటింగ్ పూర్తి..చార్మీ ట్విట్..!

siri Madhukar
ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ త‌న కుమారుడు ఆకాష్ ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రూపొందిస్తున్న మెహ‌బూబా మూవీ షూటింగ్ పూర్తి అయింది. ఇక  పూరి కనెక్ట్ వ్య‌వ‌హ‌రాల‌ను చూస్తున్న న‌టి చార్మీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో మెహ‌బూబా చిత్ర షూటింగ్ పూర్తైంద‌ని తెలియ‌జేస్తూ, లొకేష‌న్‌లో టీం అంద‌రితో క‌లిసి దిగిన ఫోటోస్‌ని షేర్ చేసింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్, పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్, హైద‌రాబాద్‌ల‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది.

1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని ల‌వ్ వార్ డ్రామాగా రూపొందించిన‌ట్టు స‌మాచారం.  ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల కాగా, టీజ‌ర్‌లో పూరి మార్క్ స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా పూరీ ఈ సినిమాని రూపొందించాడ‌ని టాక్.  

త్వ‌ర‌లోనే మూవీ విడుద‌లకి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత‌లు.  న‌టిగా కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మ‌డు పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాల‌కి సంబంధించి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చూసుకుంటుంది.  క‌ర్నాట‌క న‌టి నేహా శెట్టి ఈ మూవీలో హీరోయిన్.. సందీప్ చౌతాలా సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ మూవీ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్ర‌సాద్ ల్యాబ్ లో ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి.. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
Successfully completed the total shoot of #Mehbooba.. feeling light n going back home happy n satisfied.. thanks to each n everyone who fought this journey along with us 🙏🏻🤗 #PCfilm @PuriConnects @PuriConnects @ActorAkashPuri @Neha__Shetty @ActorVishuReddy @TheFilmMehbooba pic.twitter.com/oSk6NMJxaI

— CHARMME KAUR (@Charmmeofficial) February 23, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: