మరోసారి హిమాలయాలకు రజినీకాంత్..!

siri Madhukar
సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ మరోసారి హిమాలయాలకు వెళ్తున్నారు.  నేటి ఉదయం చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సిమ్లా చేరుకుంటారు తలైవా. ప్రస్తుతం ఆయన నటించిన ‘కాలా’ మూవీ షూటింగ్‌ అనంతర కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీ కావడంతో పాటు పొలిటికల్‌గా కీలక నిర్ణయాలు తీసుకునే తరుణంలో రజనీ హిమాలయాలకు పయనం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే కొత్త పేరు ప్రకటించనున్నారు. కాగా, ఆయన మరోసారి హిమాలయాలకు వెళ్లనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ విషయంపై స్పందించిన రజనీకాంత్ ప్రతినిధి రియాజ్‌ అహ్మద్‌.. ఆ వార్త నిజమేనని, తలైవా హిమాలయాలకు వెళుతున్నారని చెప్పారు.

ఈ నేపథ్యంలో రజినీ రిషికేష్, ధర్మశాల మొదలైన పుణ్యక్షేతాలను దర్శించి అక్కడ ఆధ్యాత్మిక గురువుల ఆశీర్వాదాలను తీసుకుని, రాజకీయ పరమైన సూచనలు సలహాలను అందుకోనున్నారు. కాగా 2017 డిసెంబర్‌ 31న రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ.. వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. 

గతంలోనూ రజనీకాంత్ చాలాసార్లు హిమాలయాల్లోని దునగిరిలో ఉన్న గుహల్లోకి వెళ్లి ధ్యానం చేసి వచ్చారన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో మహా అవతార్‌ బాబాజీ నివసించాడని భక్తులు విశ్వసిస్తారు. కొన్ని నెలల క్రితం రజనీకాంత్, ఆయన మిత్రులు కలిసి అక్కడ ఓ ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: