దటీజ్ జాన్వి..!

Edari Rama Krishna
భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీదేవి.  బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి అవార్డులు..రివార్డులు తెచ్చుకుంది.  ఇక హీరోయిన్  గా తెలుగులో రెండు తరాల హీరోలతో నటించి షెభాష్ అనిపించుకుంది.  బాహుబషా చిత్రాల్లో నటించిన శ్రీదేవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడే స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహమాడింది.  ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు..జాన్వి, ఖుషీ కపూర్.  అయితే జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది..శ్రీదేవి.

ఈ నేపథ్యంలో ధడక్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అవుతోంది.  ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్న టైంలో అనూహ్యంగా శ్రీదేవి మరణించింది.  దాంతో ఆమె కుటుంబ సభ్యులే కాదు యావత్ భారత్ లో శ్రీదేవి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.  తమ అందాల నటి ఇక కనిపించదని తెలిసి తల్లడిల్లారు.  అన్ని భాషల చిత్ర పరిశ్రమ ఒక్కసారే కుంగిపోయింది..తమతో కలిసి నటించి గొప్ప నటిని కోల్పోవడం సినీ ఇండస్ట్రీకి ఎంతో నష్టమని ఆమెకు తుది వీడ్కోలు పలికారు. 

అయితే ఇండస్ట్రీలో శ్రీదేవి ఒక్కసారే స్టార్ హీరోయిన్ కాలేదు..తనకు ఎదురైన కష్టాలన్నింటినీ పెదవి చివరనే దాచి పెట్టి అందమైన చిరునవ్వుతో వెండితెరను మెరిపించింది. తను పడ్డ కష్టం తన బిడ్డలు పడకూడదనే కూతుళ్లకు జీవితంలో ప్రతి స్టేజిలోనూ అండగా నిలబడింది.  ప్రస్తుతం శ్రీదేవి పెద్దకుమార్తె జాన్వి ధడక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

తల్లిమరణాన్ని గుండెలో దాచుకొని జాన్వి కొద్దిరోజుల్లోనే ధడక్ సెట్లోకి వచ్చేసింది. ఆవేదన కళ్లలోనే దాచుకుని షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. హీరోయిన్ గా కెరీర్ కొనసాగాలంటే ఫిట్ నెస్ ఎంత ముఖ్యమో జాన్వికి తెలియంది కాదు. అందుకే అప్పుడే జిమ్ కు కూడా వెళ్లడం మొదలెట్టింది. 

మరాఠీ సూపర్ హిట్ ఫిలిం సైరట్ కు అఫీషియల్ రీమేక్ గా వస్తున్న ధడక్ జులైలో రిలీజయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ మూవీకి నిర్మాత.  బాలీవుడ్ షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: