భరత్ అనే నేను లో మిర్చి మ్యాజిక్ !

Seetha Sailaja
‘మిర్చి’ సినిమాలో ‘పండుగలా దిగి వచ్చావు’ పాట ఆసినిమా ఘన విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించింది. కొరటాల శివ మహేష్ తో తీస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీ ఘన విజయం కోసం తిరిగి ‘మిర్చి’ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘వచ్చాడయ్యా సామి’ అనే పాట ‘భరత్ అనే నేను’ మూవీకి హైలెట్ గా మారుతుందని అంటున్నారు. 

ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. మహేష్ పంచె కట్టులో కనిపించే ఈపాటలో ఈమూవీలోని ముఖ్య తారాగణం అంతా పాల్గొనడమే కాకుండా వందలాది జూనియర్ ఆర్టిస్టులు డాన్సర్లతో ఈపాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈపాట చిత్రీకరణ ఈమూవీకి హైలెట్ గా మారనున్న నేపధ్యంలో కొరటాల శివ ఈపాట చిత్రీకరణ విషయమై అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఈపాట చిత్రీకరణ తరువాత మహేష్ కైరా అద్వానీలపై ఒక డ్రీమ్ జ్యూయేట్ సాంగ్ ను చిత్రీకరించబోతున్నారు. ఈమూవీ షూటింగ్ అంతా ఏప్రియల్ 4వ తారీఖుకు పూర్తి చేసి ఎట్టి పరిస్తుతులలోను ఏప్రియల్ 20న ఈమూవీని విడుదలచేయాలి అన్న పట్టుదలతో మహేష్ కొరటాల శివలు కాలంతో పరుగులు తీస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీ పాటల రిలీజ్ విషయంలో కొరటాల మళ్ళీ పాత పద్ధతికి వేల్లబోతున్నట్లు టాక్. 

ఈమధ్య టాప్ హీరోల సినిమాలకు సంబంధించి పాటలను సింగిల్ సాంగ్స్ గా విడుదల చేసి ఆతరువాత ఆమూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహిస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో ఇలాంటి పద్ధతి అనుసరించిన ఒకటి రెండు సినిమాల ఆడియోలు మినహా మిగతా సినిమాల పాటలు పట్టుమని నెలరోజులు కూడ వినిపించడం లేదు. ఈ పరిస్థుతులలో ‘భరత్ అనే నేను’ పాటలను ఒకొక్కటిగా కాకుండా అన్ని పాటలను ఒకేసారి భారీగా నిర్వహించే ఆడియో ఫంక్షన్ లో విడుదల చేయాలని ఈమూవీ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్లనే నిన్న ఉగాదినాడు ఈమూవీకి సంబంధించిన పాటలలో ఒక పాటను రిలీజ్ చేద్దామని భావించిన ఈ సినిమా యూనిట్ ఆఖరి నిముషంలో తమ ఆలోచనలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: