ఎట్టకేలకు కత్తి మహేష్ రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించాడు. దీనితో ఇన్ని రోజులు వచ్చిన రూమర్స్ నిజమయ్యాయి అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా కత్తి మహేశ్ వైసీపీకి సపోర్టివ్ పోస్టింగులు పెడుతు న్నాడని,బహుశా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది.
వారం క్రితం ఢిల్లీలో వైసీపీ ఎంపీలు తలపెట్టిన ఆందోళన భాగంలో కత్తి మహేశ్ సైతం పాల్గొనడం,వైసీపీ ప్లకార్డులు పట్టుకని కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక హోదా కోసం విమర్శలు చేయడంతో కత్తి మహేశ్ ఖచ్ఛితంగా రాజకీయాల్లోకి వస్తాడని అనుమానాలు తలెత్తాయి.ఇప్పుడా అనుమానాలు పటాపంచల్ చేస్తూ తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు కత్తి మహేశ్. ఇన్నాళ్లు జనసేన పార్టీని టార్గెట్ చేసుకుంటూ, బాగా పాపులారిటీని సంపాదించుకున్న కత్తి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాడు.
అయితే ఏ పార్టీ నుంచి బరిలో దిగుతాడన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వకపోగా,పోటీ మాత్రం ఖచ్ఛితంగా చేస్తానని స్పష్టం చేశాడు.తనది చిత్తూరు జిల్లా అయినందున,వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచే పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటన చేశాడు. ప్రస్తుతం తాను అన్ని పార్టీలతో టచ్ లో ఉన్నానని,అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నది,ఏ నియోజకవర్గం బరిలో ఉండబోతున్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని, ఆ తర్వాత ప్రకటిస్తానని చెప్పాడు కత్తి మహేశ్.అయితే పలువురు నెటిజన్లు మాత్రం కత్తి మహేశ్ ఖచ్ఛితంగా వైసీపీ తరపునే పోటీ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.