చరణ్ సామాజిక స్పృహ పై విమర్శలు !

Seetha Sailaja
ఈనెలాఖరకు విడుదల కాబోతున్న ‘రంగస్థలం’ మూవీ పై విపరీతమైన అంచనాలు పెరిగి పోతున్నాయి. సంక్రాంతి తరువాత భారీ గ్యాప్ తో విడుదల అవుతున్న టాప్ హీరో సినిమా కాబట్టి ఈమూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది. దీనికితోడు ఉగాది రోజున జరిగిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ భారీ సక్సస్ కావడంతో మెగా అభిమానులు ఈమూవీ పై మరిన్ని అంచనాలు పెంచేసుకుంటున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో రామ్ చరణ్ తీసుకున్న ఒక నిర్ణయం పై చరణ్ వ్యతిరేకులు సెటైర్లు వేస్తూ షోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. చరణ్ ‘రంగస్థలం’ విడుదలకు ముందే ‘మేము సైతం’ అంటూ మంచు లక్ష్మి నిర్వహించే టీవీ షోలో పాల్గొంటున్నాడు. చెర్రీ ఈకార్యక్రమంలో పాల్గొనడానికి తన అంగీకారం తెలపడంతో ఈకార్యక్రమ నిర్వాహకులు ఈ షోకు సంబంధించిన షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 

‘మేము సైతం’ కార్యక్రమంలో పాల్గొనే సెలెబ్రెటీలు అంతా జనం మధ్యకు వెళ్లి ఎదో ఒక పనిచేసి తాము సంపాదించిన డబ్బును ఈ కార్యక్రమం నిర్వహించే మంచు లక్ష్మికి ఇవ్వడం పరిపాటి.  దీనితో సామాజిక స్పృహతో కూడన ఈకార్యక్రమంలో చరణ్ పాల్గొనడం మంచిదే అయినా ‘రంగస్థలం’ విడుదలకు ముందు చరణ్ ఈకార్యక్రమంలో పాల్గొనడం వల్ల ‘మేము సైతం’ ‘రంగస్థలం’ మూవీకి ప్రమోషన్ కార్యక్రమం లా మారిపోయే ప్రమాదం ఉంది అంటూ కొందరు విమర్శిస్తున్నారు. 

ఇలా చరణ్ చేయడం వల్ల యాంటీ ఫ్యాన్స్ కు విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని కొందరి అభిప్రాయం. సరిగ్గా ‘రంగస్థలం’ విడుదలకు ముందు ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమంలో చరణ్ పాల్గొనడం ‘మేము సైతం’ కార్యక్రమానికి మరింత రేటింగ్స్ వచ్చే అవకాశాన్ని కలిపిస్తుంది..
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: